దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు నేటి ట్రేడింగ్ లో భారీ నష్టాలతో ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్ల బలహీన సంకేతాలు అమెరికా ఫెడరల్ రిజర్వు వడ్డీ రేట్ల నిర్ణయాల నేపథ్యంలో సూచీలు ఒడిదుడుకులు చూశాయి. బాంబే స్టాక్ ఎక్స్ చేంజ్ సూచీ సెన్సెక్స్ 964 పాయింట్ల నష్టంతో 79,218 వద్ద స్థిరపడింది. నేషనల్ స్టాక్ ఎక్స్ చేంజ్ సూచీ నిఫ్టీ సైతం 247 పాయింట్ల నష్టంతో 23,951 వద్ద ముగిసింది. డాలరుతో రూపాయి మారకం విలువ 85.15గా కొనసాగుతోంది. సన్ ఫార్మా , పవర్ గ్రిడ్ కార్పొరేషన్, హిందుస్థాన్ యూనీలివర్ షేర్లు లాభాల్లో ముగిశాయి.
Trending
- ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది: ఏపీ సీఎం చంద్రబాబు
- త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక టంగుటూరికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు
- గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం: మంత్రి నారా లోకేష్
- అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ
- కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష
- ‘మన శంకరవరప్రసాద్ గారు’…’పండగకి వస్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు
- ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు
- సెలక్షన్ కమిటీ ఛైర్మన్ గా అజిత్ అగార్కర్ పదవీకాలం పొడిగింపు