ఈరోజు ట్రేడింగ్ లో దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ నష్టాలతో ముగించాయి. రూ.7 లక్షల కోట్ల ఇన్వెస్టర్ల సంపద ఆవిరైంది. అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన డొనాల్డ్ ట్రంప్ కెనడా, మెక్సికోలపై ట్రేడ్ టారిఫ్ లు విధించనున్నట్లు ప్రకటించడంతో పాటు ప్రధాన షేర్లలో అమ్మకాల ఒత్తిడి కారణంగా సూచీలు నేల చూపులు చూశాయి. బాంబే స్టాక్ ఎక్స్ చేంజ్ సూచీ సెన్సెక్స్ 1,235 పాయింట్లు నష్టపోయి 75,838 వద్ద స్థిరపడింది. నేషనల్ స్టాక్ ఎక్స్ చేంజ్ సూచీ నిఫ్టీ 299 పాయింట్ల నష్టంతో 23,045 వద్ద ముగిసింది. డాలరుతో రూపాయి మారకం విలువ 86.61గా కొనసాగుతోంది. ఐటీసీ, హిందూస్తాన్ యూనీలివర్, హెచ్.సీ.ఎల్ టెక్నాలజీ షేర్లు లాభాలతో ముగిశాయి.
Trending
- ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది: ఏపీ సీఎం చంద్రబాబు
- త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక టంగుటూరికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు
- గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం: మంత్రి నారా లోకేష్
- అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ
- కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష
- ‘మన శంకరవరప్రసాద్ గారు’…’పండగకి వస్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు
- ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు
- సెలక్షన్ కమిటీ ఛైర్మన్ గా అజిత్ అగార్కర్ పదవీకాలం పొడిగింపు