దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ నష్టాలతో నేడు ట్రేడింగ్ ముగించాయి. ఐటీ, బ్యాంకింగ్ షేర్లలో అమ్మకాల ఒత్తిడితో సూచీలు నేల చూపులు చూశాయి. ఇన్వెస్టర్ల సంపదగా భావించే బీ.ఎస్.ఈలో నమోదిత కంపెనీల మొత్తం విలువ దాదాపు 3.5 లక్షల కోట్లు క్షీణించి రూ.409 లక్షల కోట్లకు పరిమితమైంది. బాంబే స్టాక్ ఎక్స్ చేంజ్ సూచీ సెన్సెక్స్ 1390 పాయింట్ల నష్టంతో 76,024 వద్ద స్థిరపడింది. నేషనల్ స్టాక్ ఎక్స్ చేంజ్ నిఫ్టీ 353 పాయింట్లు నష్టపోయి 23,165 వద్ద ట్రేడింగ్ ముగించింది. డాలర్ తో రూపాయి మారకం విలువ రూ.85.48గా కొనసాగుతోంది. ఇండస్ ఇండ్ బ్యాంక్, జొమాటో మినహా దాదాపుగా అన్ని షేర్లు నష్టాలతో ట్రేడింగ్ ముగించాయి. అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ ప్రతీకార సుంకాలపై తన నిర్ణయాన్ని ప్రకటించనున్న నేపథ్యంలో మార్కెట్లపై ప్రభావం చూపింది.
Trending
- ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది: ఏపీ సీఎం చంద్రబాబు
- త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక టంగుటూరికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు
- గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం: మంత్రి నారా లోకేష్
- అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ
- కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష
- ‘మన శంకరవరప్రసాద్ గారు’…’పండగకి వస్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు
- ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు
- సెలక్షన్ కమిటీ ఛైర్మన్ గా అజిత్ అగార్కర్ పదవీకాలం పొడిగింపు