అంతర్జాతీయ సానుకూల సంకేతాలతో వరుస నష్టాల నుండి కోలుకుని తిరిగి లాభాలతో దూసుకెళ్లాయి. అనూహ్యంగా వచ్చిన కొనుగోళ్ల మద్దతుతో దేశీయ స్టాక్ మార్కెట్లు జోరు కనబరిచాయి. బ్యాంకింగ్ స్టాక్స్ కొనుగోళ్ల మద్దతుతో సూచీలు భారీ లాభాలు చూశాయి. ముఖ్యంగా రిలయన్స్, ఐసీఐసీఐ, ఇన్ఫోసిస్ షేర్లు సూచీల జోరును మరింత పెంచాయి. బాంబే స్టాక్ ఎక్స్ చేంజ్ సెన్సెక్స్ ఓ దశలో 2 వేల పాయింట్లకు పైగా లాభపడింది. ఇక నేషనల్ స్టాక్ ఎక్స్ చేంజ్ నిఫ్టీ సైతం 550 పాయింట్లకు పైగా లాభపడింది. బీఎస్ఈలో నమోదిత కంపెనీల మొత్తం విలువ ఒక్కరోజులో దాదాపు రూ.7 లక్షల కోట్లకు పైగా పెరిగి రూ.432 లక్షల కోట్లకు చేరింది. చివరికి సెన్సెక్స్ 1,961 పాయింట్ల లాభంతో 79,117 ఇక నిఫ్టీ సైతం 557 పాయింట్లు లాభపడి 23,907 వద్ద ముగిసింది. సెన్సెక్స్ 30 లో దాదాపు అన్ని షేర్లూ లాభపడ్డాయి. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, టీసీఎస్, ఐటీసీ, టైటాన్, ఇన్ఫోసిస్ షేర్లు ప్రధానంగా లాభాల్లో ముగిశాయి. నిన్న పతనమైన అదానీ షేర్లు కూడా నేడు కోలుకుని లాభాల్లోకి వెళ్లాయి. డాలర్ తో రూపాయి మారకం విలువ రూ.84.44గా కొనసాగుతోంది.
Trending
- ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది: ఏపీ సీఎం చంద్రబాబు
- త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక టంగుటూరికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు
- గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం: మంత్రి నారా లోకేష్
- అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ
- కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష
- ‘మన శంకరవరప్రసాద్ గారు’…’పండగకి వస్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు
- ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు
- సెలక్షన్ కమిటీ ఛైర్మన్ గా అజిత్ అగార్కర్ పదవీకాలం పొడిగింపు