ఈ వారాంతాన్ని దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు భారీ నష్టాలతో ముగించాయి. దీంతో వరుసగా ఐదురోజుల పాటు నష్టాలతోనే ట్రేడింగ్ ముగించినట్లయింది. అంతర్జాతీయ మార్కెట్ల ప్రతికూల సంకేతాలు అమ్మకాల ఒత్తిడి కారణంగా సూచీలు భారీగా పతనమయ్యాయి. ఈవారంలో దాదాపుగా సెన్సెక్స్ 4 వేల పాయింట్ల వరకు నష్టపోయింది. ఇన్వెస్టర్ల సంపదగా భావించే బీ.ఎస్.ఈ లో నమోదిత కంపెనీల మొత్తం విలువ రూ.9 లక్షల కోట్లు ఆవిరైంది.
బాంబే స్టాక్ ఎక్స్ చేంజ్ సూచీ సెన్సెక్స్ 1176 పాయింట్ల నష్టంతో 78,041 వద్ద స్థిరపడింది. నేషనల్ స్టాక్ ఎక్స్ చేంజ్ సూచీ నిఫ్టీ సైతం 364 పాయింట్ల నష్టంతో 23,587 వద్ద ముగిసింది. డాలరుతో రూపాయి మారకం విలువ 85.15గా కొనసాగుతోంది. నెస్లే ఇండియా, టైటాన్ షేర్లు లాభాల్లో ముగిశాయి.
Trending
- ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది: ఏపీ సీఎం చంద్రబాబు
- త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక టంగుటూరికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు
- గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం: మంత్రి నారా లోకేష్
- అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ
- కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష
- ‘మన శంకరవరప్రసాద్ గారు’…’పండగకి వస్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు
- ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు
- సెలక్షన్ కమిటీ ఛైర్మన్ గా అజిత్ అగార్కర్ పదవీకాలం పొడిగింపు