ప్రముఖ పుణ్యక్షేత్రం విజయవాడ ఇంద్రకీలాద్రిపై భవానీ దీక్షల విరమణ నేపథ్యంలో రద్దీ పెరిగింది. దీక్షల విరమణ చివరిరోజు సందర్భంగా భారీ సంఖ్యలో భవానీలు తరలివచ్చారు. అమ్మవారి నామస్మరణతో ఇంద్రకీలాద్రి మార్మోగుతోంది. రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు తమిళనాడు, కర్ణాటక, ఒడిశా, మహారాష్ట్రల నుండి తరలివచ్చిన భక్తుల కోసం ఆలయ అధికారులు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేశారు . అమ్మవారి దర్శనం అనంతరం భవానీ ఘాట్, పున్నమి ఘాట్, సీతమ్మ వారి పాదాలు వద్ద తాత్కాలికంగా ఏర్పాటు చేసిన కేశ ఖండన శాల వద్ద భక్తులు తలనీలాలు సమర్పిస్తున్నారు. అమ్మవారి దర్శనానికి వచ్చే భక్తుల కోసం ఉచిత అన్నప్రసాదం అందిస్తున్నారు. ఈరోజు పూర్ణాహుతితో దీక్షల విరమణ కార్యక్రమం పూర్తికానుంది.
భవానీ దీక్షల విరమణ సందర్భంగా విజయవాడ ఇంద్రకీలాద్రికి భారీసంఖ్యలో భక్తులు
By admin1 Min Read