గన్నవరం మాజీ ఎమ్మెలే , వైసీపీ నాయకుడు వల్లభనేని వంశీ అరెస్ట్ పై ఏపీ హోమ్ మంత్రి వంగలపూడి అనిత స్పందించారు.కాగా వంశీ అరెస్ట్ అక్రమమని వైసీపీ నేతలు ఆందోళన చేస్తున్నారు…వంశీ అరెస్ట్ సక్రమమేనని ఆమె వ్యాఖ్యానించారు.వంశీ అరెస్ట్ విషయంలో కర్మ సిద్ధాంతం కనిపిస్తోందని అన్నారు.అన్ని ఆధారాలతోనే వంశీని అరెస్ట్ చేశారని వెల్లడించారు.
ఈ మేరకు మరో మంత్రి సవిత మాట్లాడుతూ…టీడీపీ పార్టీ కార్యాలయంపై దాడి చేయడం, కేసు పెట్టిన వ్యక్తిని బెదిరించడం, కిడ్నాప్ చేయడం వంటి చర్యలు దారుణమని అన్నారు. చంద్రబాబు భార్య భువనేశ్వరిని అసెంబ్లీలో అవమానించారని ఆగ్రహం వ్యక్తం చేశారు.అప్పటి సీఎం జగన్ శాసనసభలో పైశాచిక ఆనందం పొందారని మండిపడ్డారు.అయితే మహిళలను అవమానించిన రాజ్యాలు కూలిపోయాయని…దీనికి పురాణాలే సాక్ష్యమని అన్నారు.జగన్ తల్లిని,చెల్లిని వాడుకుని వదిలేశారని,బాబాయ్ పై గొడ్డలి వేటు వేశారని అన్నారు.