రాష్ట్రంలోని అన్ని పోలీస్ స్టేషన్లలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్రంలో మొత్తం 1,392 పోలీస్ స్టేషన్లు ఉండగా… కేవలం 1,001 స్టేషన్లలోనే సీసీ కెమెరాలు ఉన్నాయని మిగతా స్టేషన్లలో కెమెరాలు ఎందుకు పెట్టలేదని ప్రశ్నించింది. దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీం మార్గదర్శకాలకు అనుగుణంగా అన్ని పోలీసు స్టేషన్ లలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని ఆదేశించింది. అన్ని పోలీస్ స్టేషన్లలో ఉన్న సీసీ కెమెరాల పనితీరుపై నివేదిక ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది. జైళ్లలో ఉన్న సీసీ కెమెరాల పనితీరుపై కూడా నివేదిక ఇవ్వాలని ఆదేశించింది. గతంలో కూడా పీఎస్ లు, జైళ్లలో సీసీ కెమెరాలపై హైకోర్టులో విచారణ జరిగింది. అన్నిచోట్ల సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని అప్పుడే హైకోర్టు ఆదేశించింది. అయితే పీఎస్ లు, జైళ్లలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేసినప్పటికీ మేనేజ్మెంట్, సాంకేతిక కారణాల కారణంగా చాలా కెమెరాలు పని చేయడం లేదు. దీంతో, సుప్రీంకోర్టు మార్గదర్శకాల అమలులో పురోగతి లేదంటూ హైకోర్టులో కోర్టు ధిక్కరణ పిటిషన్ దాఖలయింది. ఈ పిటిషన్ ను విచారించిన హైకోర్టు ఈమేరకు సీసీ కెమెరాల ఏర్పాటుకు సంబంధించి మరోసారి కీలక ఆదేశాలను జారీ చేసింది.
సుప్రీం మార్గదర్శకాలకు అనుగుణంగా అన్ని పోలీస్ స్టేషన్లలో సీసీ కెమెరాలుండాలి: ఏపీ హైకోర్టు
By admin1 Min Read