ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రాలలో ఒకటైన ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీశైలంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు నేటి నుండి ప్రారంభమయ్యాయి. మార్చి 1వ తేదీ వరకు 11 రోజుల పాటు బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. ఈ ఉత్సవాల సందర్భంగా జ్యోతిర్లింగస్వరూపుడైన శ్రీమల్లికార్జునస్వామివారికి విశేష అర్చనలు, మహాశక్తి స్వరూపిణి అయిన శ్రీభ్రమరాంబాదేవివారికి ప్రత్యేకపూజలు, శ్రీస్వామిఅమ్మవార్లకు వివిధ వాహనసేవలు, ఫిబ్రవరి 26వ తేదీ మహాశివరాత్రిపర్వదినం సందర్భంగా శ్రీస్వామివారికి లింగోద్భవకాల మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం, పాగాలంకరణ, శ్రీస్వామిఅమ్మవార్ల కల్యాణ మహోత్సవం, ఫిబ్రవరి 27వ తేదీన రథోత్సవం మరియు తెప్పోత్సవం జరుగనున్నాయి. దీంతో వివిధ ప్రాంతాల నుండి భక్తులు భారీగా తరలివస్తున్నారు. ఈ ఉత్సవాలను పురస్కరించుకొని పలు ధార్మిక, సాంస్కృతిక కార్యక్రమాలకు ఏర్పాటు చేశారు.
Trending
- ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది: ఏపీ సీఎం చంద్రబాబు
- త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక టంగుటూరికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు
- గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం: మంత్రి నారా లోకేష్
- అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ
- కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష
- ‘మన శంకరవరప్రసాద్ గారు’…’పండగకి వస్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు
- ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు
- సెలక్షన్ కమిటీ ఛైర్మన్ గా అజిత్ అగార్కర్ పదవీకాలం పొడిగింపు