జనసేన ఎమ్మెల్సీ అభ్యర్థిగా కొణిదెల నాగబాబు నామినేషన్ దాఖలు చేశారు. ఎమ్మెల్యే కోటాలో జరుగనున్న ఎమ్మెల్సీ ఎన్నికకి కూటమి తరఫున జనసేన అభ్యర్థిగా నాగబాబు నేటి మధ్యాహ్నం నామినేషన్ దాఖలు చేశారు. రాష్ట్ర మంత్రులు నాదెండ్ల మనోహర్, నారా లోకేష్, బీజేపీ శాసనపక్ష నేత పి.విష్ణుకుమార్ రాజు, ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణతో కలిసి రిటర్నింగ్ అధికారి శ్రీమతి వనితా రాణికి నామినేషన్ పత్రాలు సమర్పించారు. నామినేషన్ దాఖలు సందర్భంగా కూటమి ఎమ్మెల్యేలు నాగబాబుని కలిసి శుభాకాంక్షలు తెలిపారు.
Previous Articleకన్నడి నటి రాన్యా రావు అరెస్ట్ …!
Next Article వారాంతంలో ఫ్లాట్ గా ముగిసిన సూచీలు..!

