ఏపీ మైనారిటీ శాఖ మంత్రి ఎన్ఎండీ ఫరూఖ్ కు సతీమణి కన్నుమూశారు. ఆయన భార్య షహనాజ్ హైదరాబాదులోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఈ నేపథ్యంలో, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేష్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు.
ఏపీ సీఎం చంద్రబాబు:
రాష్ట్ర మంత్రి శ్రీ ఎన్ఎండీ ఫరూక్ సతీమణి శ్రీమతి షెహనాజ్ మరణించారని తెలిసి దిగ్భ్రాంతికి గురయ్యాను. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె మరణించడం ఆ కుటుంబానికి తీరని లోటు. ఆమె ఆత్మకు శాంతి కలగాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నాను. ఈ క్లిష్ట సమయంలో గుండె నిబ్బరం తో ఉండాలని మంత్రి శ్రీ ఫరూక్ ను కోరుతున్నాను.
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్:
ఆంధ్రప్రదేశ్ న్యాయ మరియు మైనార్టీ శాఖ మంత్రి ఎన్ ఎం డి ఫరూక్ గారి సతీమణి శ్రీమతి షహనాజ్ గారు మరణ వార్త తీవ్ర బాధాకరం. వారి మృతి పట్ల తీవ్ర సంతాపం తెలియజేస్తూ, వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను.
మంత్రి నారా లోకేష్:
ఏపీ న్యాయ, మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ గారి సతీమణి షహనాజ్ గారు పవిత్ర రంజాన్ మాసంలో ఇంతిఖాల్ అయ్యారు. ఆమెకు జన్నత్లో ఉన్నతమైన స్థానం ప్రసాదించాలని, ఆత్మకు శాంతి కలగాలని అల్లాని ప్రార్థిస్తున్నాను. వారి కుటుంబసభ్యులకు నా ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నాను.
మంత్రి ఫరూఖ్ భార్య కన్నుమూత: సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్, మంత్రి లోకేష్ దిగ్బ్రాంతి
By admin1 Min Read