గ్రేటర్ విశాఖపట్నం మేయర్గా కూటమి అభ్యర్థి పిలా శ్రీనివాస్ రావు ఎన్నికయ్యారు. పీలా శ్రీనివాసరావు పేరును జనసేన ఎమ్మెల్యే వంశీ కృష్ణ యాదవ్ ప్రతిపాదించారు . బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు బలపరిచారు. దీంతో మేయర్ అభ్యర్థి ఎన్నిక ఏకగ్రీవం అయ్యింది. ఇక ప్రతిపక్ష వైసీపీ మేయర్ ఎన్నికను వైసీపీ బహిష్కరించింది. కోరం సరిపోవడంతో జీవీఎంసీ కౌన్సిల్ సమావేశం సోమవారం ఉదయం ప్రారంభమైంది. కూటమి టీడీపీ అభ్యర్థిగా పీలా శ్రీనివాసరావును జనసేన, బీజేపీ, కూటమి కార్పొరేటర్లు బలపరిచారు. పోటీలో ఇంకెవరూ లేనందున మేయర్గా పీలా శ్రీనివాసరావు ఎన్నికైనట్లు ఎన్నికల అధికారి, జాయింట్ కలెక్టర్ మయూరి అశోక్ ప్రకటించారు. పీలా శ్రీనివాసరావు మేయర్గా ఎన్నికైనట్లు ఎన్నిక ధృవపత్రాన్ని జాయింట్ కలెక్టర్ అందజేశారు. విశాఖ కొత్త మేయర్గా పీలా శ్రీనివాసరావుతో ఎన్నికల అధికారి మయూరి అశోక్ ప్రమాణ స్వీకారం చేయించారు. పీలా శ్రీనివాసరావు బాధ్యతలు చేపట్టారు.
గ్రేటర్ విశాఖపట్నం మేయర్గా కూటమి అభ్యర్థి పిలా శ్రీనివాస్ రావు ఎన్నిక ఏకగ్రీవం
By admin1 Min Read