అమరావతి మహిళలపై అసభ్య వ్యాఖ్యల కేసులో అరెస్టయిన సాక్షి ఛానల్ యాంకర్ కొమ్మినేని శ్రీనివాసరావును పోలీసులు గుంటూరు జిల్లా మంగళగిరి కోర్టులో హాజరుపరిచారు. కోర్టు ఆయనకు 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధించింది. అనంతరం గుంటూరు జిల్లా జైలుకు ఆయనను తరలించారు. నాలుగు రోజుల కిందట సాక్షి టీవీ ఛానెల్లో ప్రసారమైన ‘కేఎస్ఆర్ లైవ్ షో’లో అమరావతి వేశ్యల రాజధాని అంటూ జర్నలిస్టు వీవీఆర్ కృష్ణంరాజు అత్యంత దారుణమైన వ్యాఖ్యలు చేశారు. ఆ కార్యక్రమాన్ని నిర్వహించిన సాక్షి యాంకర్ కొమ్మినేని శ్రీనివాసరావు ఆ వ్యాఖ్యల్ని ఖండించకపోగా వాటిని కొనసాగించేందుకు మరింత ఊతమిచ్చారని అనుచిత వ్యాఖ్యలపై గత రెండురోజులుగా రాష్ట్రమంతటా మహిళలు పెద్ద ఎత్తున నిరసన ప్రదర్శనలు చేస్తున్న విషయం తెలిసిందే.
Trending
- ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది: ఏపీ సీఎం చంద్రబాబు
- త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక టంగుటూరికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు
- గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం: మంత్రి నారా లోకేష్
- అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ
- కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష
- ‘మన శంకరవరప్రసాద్ గారు’…’పండగకి వస్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు
- ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు
- సెలక్షన్ కమిటీ ఛైర్మన్ గా అజిత్ అగార్కర్ పదవీకాలం పొడిగింపు