రానున్న మూడు సంవత్సరాలలో రాజధాని ప్రాంతంలో ముఖ్యమైన పనులన్నీ పూర్తి చేయనున్నట్లు రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి పి నారాయణ తెలిపారు. గత ప్రభుత్వం పాత టెండర్లను రద్దు చేయడంతో కొత్త టెండర్లను పిలిచినట్లు పేర్కొన్నారు. దీంతో రూ. 2,507 కోట్ల రూపాయల అదనపు భారం ప్రభుత్వంపై పడిందన్నారు.రాష్ట్ర మంత్రి వర్గ సమావేశానంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. రాజధాని అభివృద్ధిపై సీ.ఆర్.డి.ఏ అథారిటీ సమావేశ నిర్ణయాలకు మంత్రి వర్గం ఆమోదం తెలిపిందని వివరించారు. రూ.11,471 కోట్ల రూపాయలతో అమరావతిలో పనులు చేపట్టేందుకు మంత్రివర్గం ఆమోదం తెలిపిందన్నారు. అమరావతిని ప్రపంచంలోనే ఐదు అద్భతమైన రాజధానుల్లో ఒకటిగా తీర్చిదిద్దనున్నట్లు తెలిపారు.
Trending
- ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది: ఏపీ సీఎం చంద్రబాబు
- త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక టంగుటూరికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు
- గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం: మంత్రి నారా లోకేష్
- అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ
- కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష
- ‘మన శంకరవరప్రసాద్ గారు’…’పండగకి వస్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు
- ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు
- సెలక్షన్ కమిటీ ఛైర్మన్ గా అజిత్ అగార్కర్ పదవీకాలం పొడిగింపు