రాష్ట్రవ్యాప్తంగా నేడు మెగా పేరెంట్-టీచర్ మీటింగ్ కార్యక్రమాన్ని ఏపీ ప్రభుత్వం నిర్వహించిన సంగతి తెలిసిందే. సీఎం చంద్రబాబు, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ నేడు బాపట్ల మున్సిపల్ హైస్కూల్లో ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వీరిరువురూ విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజనం చేశారు. భోజనం పూర్తయిన తర్వాత చంద్రబాబు తిన్న ప్లేట్ ను నారా లోకేశ్ తీయడం సోషల్ మీడియాలో వైరలయింది. దీనిపై లోకేష్ తల్లి, చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి స్పందించారు. ఈమేరకు ఆమె ‘ఎక్స్’ లో అందుకు సంబంధించిన వీడియోను పంచుకున్నారు. “వెల్ డన్ లోకేశ్… చంద్రబాబు గారు తిన్న ప్లేట్ ను నువ్వు తీయడం, భోజన అనంతరం శుభ్రం చేస్తున్న సిబ్బందికి సాయపడడం… తల్లిదండ్రుల పట్ల నీకున్న అత్యంత గౌరవాన్ని చూపడమే కాదు, నిత్యం మనతో ఉండే వారి పట్ల ఎంతటి విధేయతను కలిగి ఉన్నావో ఈ పనితో స్పష్టమవుతోంది నిజంగా ఇది స్ఫూర్తిదాయకం అంటూ తన కుమారుడిపై ప్రశంసలు కురిపించారు.
Well done, @naralokesh! Your thoughtful gesture of picking up @ncbn Garu’s plate and helping the staff clean up not only shows your deep respect for parents but also your humility and regard for those who help us daily. Truly inspiring!#MegaParentTeacherMeeting pic.twitter.com/riTcw1i9Ff
— Nara Bhuvaneswari (@ManagingTrustee) December 7, 2024