సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యార్థి మిత్ర కిట్టులో భాగంగా ఇచ్చే యూనిఫాం, బెల్టులు, బ్యాగ్ల రంగులను ప్రభుత్వం మార్పు చేసింది. రాజకీయ పార్టీలకు సంబంధించిన రంగులు, రాజకీయ నేతల బొమ్మలు లేకుండా వీటిని తీసుకురానున్నారు. బెల్టుల అంచులకు నలుపు రంగు, మధ్యలో తెలుపు రంగు ఉండనుంది. బెల్టులపై కేవలం ప్రత్యేకంగా రూపొందించిన గ్రాడ్యుయేట్ బొమ్మతో కూడిన లోగో ఉండనుంది. బ్యాగ్లు లేత ఆకుపచ్చ రంగులో ఉన్న వాటిని ప్రభుత్వం ఎంపిక చేసింది. యూనిఫాం లేత ఆకుపచ్చ, గులాబీ రంగు పెద్ద గడుల చొక్కా, లేత ఆకుపచ్చ రంగు ప్యాంట్తో కూడినవి ఇవ్వనున్నారు. 2025 జూన్ 12న బడులు తెరిచే రోజే విద్యార్థులకు అందించనున్నట్లు తెలుస్తోంది. దానికి అనుగుణంగా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఈ మేరకు త్వరలో టెండర్లు పిలవనున్నారు.
సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యార్థి మిత్ర కిట్టులో ఇచ్చే యూనిఫాం, బెల్టులు, బ్యాగ్ల రంగుల మార్పు
By admin1 Min Read