పుష్ప సినిమా విడుదల సందర్భంగా సంధ్య థియేటర్ లో జరిగిన ఘటనలో అల్లు అర్జున్ అంశంపై ఏపీ బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.అల్లు అర్జున్ వివాదం గురించి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో చెప్పింది వాస్తవాలే అయితే,తాను కూడా ఆయనతో ఏకీభవిస్తానని చెప్పారు.ఇది తన వ్యక్తిగత అభిప్రాయమని అన్నారు.జైలు నుండి వచ్చాక అల్లు అర్జున్ ను చాలామంది పరామర్శించారని,బాధిత కుటుంబాన్ని ఎందుకు పరామర్శించలేదని విష్ణుకుమార్ రాజు ప్రశ్నించారు.బెనిఫిట్ షోలకు తప్పనిసరిగా పోలీసులు అనుమతి తీసుకోవాలని,అల్లు అర్జున్ వెళ్లడంతోనే ఈ ఘటన జరిగినట్టు స్పష్టంగా కనిపిస్తోందని తెలిపారు.సెలబ్రిటీలు ఎక్కడికైనా వెళుతుంటే పోలీసుల అనుమతి తప్పనిసరి అని పేర్కొన్నారు.తొక్కిసలాటలో ఒక మహిళ మృతి చెందారని చెప్పినప్పుడు,బాధ్యతగా అక్కడ్నించి వెళ్లిపోతే బాగుండేదని అభిప్రాయం వ్యక్తం చేశారు.
బాధ్యతగా అక్కడి నుండి వెళ్ళిపోయి ఉంటే బాగుండేది :- బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు
By admin1 Min Read

