వాట్సప్ వేదికగా ఎక్కువగా ఆన్లైన్ మోసాలకు పాల్పడుతున్నారూ – హోంమంత్రిత్వ శాఖ
ఈ ఇంటర్నెట్ యుగంలో సైబర్ నేరాలు నానాటికీ పెరిగిపోతున్నాయి.రోజుకో కొత్త పంథాలో నేరగాళ్లు రెచ్చిపోతున్నారు.భారీ లాభాల పేరుతో ఆశజూపడం లేదా డిజిటల్ అరెస్టుల పేరుతో భయభ్రాంతులకు గురిచేస్తూ డబ్బులు గుంజుతున్నారు.ఈ మోసాలకు సైబర్ నేరగాళ్లు ఎక్కువగా మెసేజింగ్ ప్లాట్ఫాట్ ‘వాట్సప్’నే వినియోగిస్తున్నారని తెలుస్తుందని ఈ మేరకు కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ఓ నివేదికలో వెల్లడించింది.
వాట్సప్ వేదికగా స్కామర్లు ఎక్కువగా ఆన్లైన్ మోసాలకు పాల్పడుతున్నారని హోంమంత్రిత్వ శాఖ పేర్కొంది. ఆ తర్వాత టెలిగ్రామ్, ఇన్స్టాగ్రామ్ ఉన్నట్లు పేర్కొంది. 2023-24 సైబర్ మోసాల జాబితాను హోంశాఖ తాజాగా విడుదల చేసింది. 2024 తొలి మూడు నెలల్లో వాట్సప్ వేదికగా జరిగిన మోసాలకు సంబంధించి 43,797 ఫిర్యాదులు వచ్చినట్లు ఆ నివేదికలో వెల్లడించింది. ఇక, టెలిగ్రామ్లో మోసాలపై 22,680,ఇన్స్టా వేదికగా జరిగే నేరాలపై 19,800 ఫిర్యాదులు వచ్చాయని తెలిపింది.