లోక్ సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీపై సభా హక్కుల ఉల్లంఘన తీర్మానాన్ని ప్రవేశపెట్టాలని బీజేపీ ఎంపీ నిశికాంత్ దూబే లోక్సభ స్పీకర్ ఓం బిర్లాను కోరారు.ఈ మేరకు భారత గడ్డపై చైనా సైన్యం తిష్ట వేసిందని పార్లమెంట్ లో ఇటీవల రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలు అధికార,విపక్ష పార్టీల మధ్య మాటల యుద్ధానికి తెరలేపాయి.రాహుల్ అబద్దాలు చెప్తున్నారని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రీ కిరణ్ రిజుజు విమర్శించారు.
అయితే రాహుల్ చరిత్రను,వాస్తవాలను సిగ్గు లేకుండా వక్రీకరించారు.మన దేశాన్ని అపహాస్యం చేయడానికి,మన గణతంత్ర ప్రతిష్ఠను తగ్గించడానికి ప్రయత్నించారని దూబే తన లేఖలో వెల్లడించారు.రాహుల్ చేసిన ఆరోపణలకు ఆధారాలు చూపకుంటే ఆయనపై సభా హక్కుల ఉల్లంఘన తీర్మానాన్ని ప్రతిపాదించాలని ఆలోచనలో దూబే ఉన్నట్లు సమాచారం.భారత్ కు చెందిన 4 వేల చ.కి.మీ భూమిలో చైనా తిష్ట వేసిందని రాహుల్ గాంధీ సోమవారం పార్లమెంట్లో సంచలన వ్యాఖ్యలు చేశారు.