భారత్ ఖతార్ దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు మరింత పటిష్టం కానున్నాయి. రెండు దేశాల మధ్య వాణిజ్య కార్యకలాపాలు శరవేగంగా ముందుకు తీసుకెళ్లేందుకు మరియు వ్యూహాత్మక భాగస్వాములుగా ఎదగడానికి ఇరు దేశాలు నిర్ణయించాయి. రెండు దేశాల మధ్య వాణిజ్యం సుమారు రూ.2.43 లక్షల కోట్లకు తీసుకెళ్లాలని లక్ష్యంగా పెట్టుకున్నాయి. అలాగే డ్యూయల్ ట్యాక్స్ విధానం రద్దు ఒప్పందాలపై భారత్-ఖతార్ ప్రతినిధులు సంతకాలు చేశారు. మరికొన్ని ఎంఓయూలు కూడా జరిగాయి. వాటిలో ఆర్కైవ్స్ మేనేజ్మెంట్, యువజన వ్యవహారాలు, ఆర్థిక భాగస్వామ్యం బలోపేతం, క్రీడలలో సహాకారం వంటివి ఉన్నాయి. ఈ కార్యక్రమం భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, ఖతార్ పాలకుడు షేక్ తమీమ్ బిన్ హమద్ అల్ దానిల సమక్షంలో హైదరాబాద్ హౌస్ లో జరిగింది. దీనికి ముందు ఇరువురు నేతలు విస్తృతస్థాయి చర్చలు జరిపారు.
భారత్ ఖతార్ దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు మరింత పటిష్టం… కీలక ఎంఓయూలు
By admin1 Min Read