పుదుచ్చేరిలోని మనకుల వినయగర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీకి చెందిన స్టూడెంట్ విశ్వ రాజ్కుమార్ (20) గ్లోబల్ మెమరీ లీగ్ వరల్డ్ ఛాపింయన్షిప్లో విజేతగా నిలిచాడు.కాగా ఆన్లైన్లో జరిగిన ఈ పోటీల్లో కేవలం 13.50 సెకన్లలో 80 అంకెలను గుర్తుకు తెచ్చుకొని సహ పోటీదారులను ఆశ్చర్యపోయేలా చేశాడు.అయితే యాదృచ్ఛికంగా తెరపై ప్రదర్శించిన 80 అంకెలను వీలైనంత త్వరగా తిరిగి గుర్తుకు తెచ్చుకోవాలి.వాటిని 100% కచ్చితత్వంతో రీకాల్ షీట్లో నమోదు చేయాలి.రాజ్కుమార్ ఈ లక్ష్యాన్ని రికార్డు వేగంతో పూర్తి చేయడంతో పాటు 30 చిత్రాలను కేవలం 8.40 సెకన్లలో తిరిగి గుర్తు చేసుకున్నాడు.
గ్లోబల్ మెమరీ లీగ్ లో ప్రపంచ ఛాంపియన్ గా నిలిచిన విశ్వ రాజ్కుమార్
By admin1 Min Read