న్యూజిలాండ్ ప్రధాని క్రిస్టఫర్ లక్సన్ భారతలో పర్యటిస్తున్నారు.ఈ మేరకు ఆయన ఢిల్లీలో సరదాగా కాసేపు క్రికెట్ ఆడి సందడి చేశారు.కాగా కివీస్ మాజీ క్రికెటర్ రాస్ టేలర్తో కలిసి ఢిల్లీలో స్థానిక పిల్లలతో క్రికెట్ ఆడారు.ఈ క్షణాలను ఆయన సోషల్ మీడియాలో పంచుకోగా, ఫోటోలు వైరల్గా మారాయి.తన పర్యటనలో భాగంగా రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో పాటు పలువురు కేంద్ర మంత్రులను కలిశారు.ఇరుదేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేయాలని లక్ష్యంగా పెట్టుకుని మోదీ,లక్సన్ విస్తృత చర్చలు జరిపారు.ఈ భేటీలో వాణిజ్యం, పెట్టుబడులు, విద్య, టెక్నాలజీ వంటి అంశాలపై చర్చించారు.భారత పర్యటన తనకు మధురానుభూతిని ఇచ్చిందని క్రిస్టఫర్ లక్సన్ పేర్కొన్నారు.
Prime Minister of New Zealand Christopher Luxon, during his visit to Delhi, shared pictures of him and former New Zealand international cricketer Ross Taylor playing cricket with children in Delhi. pic.twitter.com/pZc4kD7x5C
— ANI (@ANI) March 19, 2025

