ఈకామర్స్ దిగ్గజాలు ఫ్లిప్కార్ట్, అమెజాన్ గోడౌన్లపై బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (బీఐఎస్) అధికారులు జరిపిన దాడుల్లో నకిలీ, నాసిరకం ఉత్పత్తులను స్వాధీనం చేసుకున్నారు. ఢిల్లీలోని మోహన్ కోఆపరేటివ్ ఇండస్ట్రియల్ ఏరియాలో అమెజాన్ సెల్లర్స్ ప్రైవేట్ లిమిటెడ్ గోడౌన్లో జరిగిన తనిఖీల్లో గీజర్లు, మిక్సీలు, ఇతర ఎలక్ట్రికల్ వస్తువులను గుర్తించారు. వీటికి ఐఎస్ఐ గుర్తింపు లేకుండా నకిలీ లేబుళ్లతో విక్రయిస్తున్నట్లు తేలింది.ఇక ఫ్లిప్కార్ట్కు చెందిన ఇన్స్టాకార్ట్ సర్వీస్ ప్రైవేట్ లిమిటెడ్ గోడౌన్లోనూ నాసిరకం ఉత్పత్తులు ఉన్నట్లు అధికారులు వెల్లడించారు.డిస్పాచ్కు సిద్ధంగా ఉన్న స్పోర్ట్స్ ఫుట్వేర్లను సీజ్ చేశారు.వీటిపై తయారీ తేదీ, ఐఎస్ఐ ముద్ర లేవని తెలిపారు.మొత్తం రూ. 6 లక్షల విలువైన 590 జతల షూస్ను స్వాధీనం చేసుకున్నారు.గత వారం తమిళనాడులోనూ బీఐఎస్ అధికారులు 3,000 ఉత్పత్తులను సీజ్ చేశారు.నకిలీ ఉత్పత్తుల అమ్మకాన్ని నియంత్రించేందుకు కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు వెల్లడించారు. ప్రజలు నాణ్యతా ప్రమాణాలు లేని వస్తువులను కొనుగోలు చేసే ముందు పరిశీలించాలని సూచించారు.
ఫ్లిప్కార్ట్, అమెజాన్ గోడౌన్లపై దాడులు – నకిలీ ఉత్పత్తులు స్వాధీనం
By admin1 Min Read