పాకిస్థాన్ ఉగ్రవాద స్థావరాలపై ఈరోజు భారత బలగాలు ‘ఆపరేషన్ సిందూర్’ తో విరుచుకుపడి పదుల సంఖ్యలో ఉగ్రవాదులను అంతమొందించిన సంగతి తెలిసిందే.పహాల్గాం దాడికి ప్రతిచర్యగా పాకిస్థాన్ ను దెబ్బకు దెబ్బతీసిన భారత్ తదుపరి చర్యలపై దృష్టి కేంద్రీకరించింది. ఈ క్రమంలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా దేశ రాజధాని ఢిల్లీలో అత్యవసర సమీక్ష నిర్వహించారు. పాక్, నేపాల్ సరిహద్దు రాష్ట్రాల సీఎం లు, సీఎస్ లు, డీజీపీలతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమావేశమయ్యారు. ఈ సమీక్ష సమావేశానికి జమ్ముకశ్మీర్, పంజాబ్, రాజస్థాన్, ఉత్తరాఖండ్, గుజరాత్, ఉత్తరప్రదేశ్, బీహార్, పశ్చిమ బెంగాల్, సిక్కిం రాష్ట్రాల సీఎంలు హాజరయ్యారు. లఢఖ్ లెఫ్టినెంట్ గవర్నర్ కూడా ఈ సమీక్షలో పాల్గొన్నారు. రేపు దేశ రాజధాని ఢిల్లీలో ఉదయం 11 గంటలకు అఖిలపక్ష భేటీ జరగనుంది.
పలు రాష్ట్రాల సీఎంలతో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అత్యవసర సమీక్ష
By admin1 Min Read