దేశ రాజధాని దిల్లీలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఓ కీలక పరిణామం చోటుచేసుకుంది.ఢిల్లీ మద్యం కేసులో మాజీ ముఖ్యమంత్రి,ఆప్ కన్వీనర్ ఆరవింద్ కేజ్రీవాల్ ను విచారించేందుకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కు అనుమతి లభించింది.ఈ మేరకు లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా ఈడీ కు కావాల్సిన అనుమతులు మంజూరు చేశారు.దీనిపై అధికారిక ప్రకటన విడుదల అయింది.
సీఆర్పీసీ ప్రకారం..మనీలాండరింగ్కు సంబంధించి ప్రజాప్రతినిధులను విచారించాలంటే ముందస్తు అనుమతులు తప్పనిసరి.ఈ క్రమంలోనే కేజ్రీవాల్ విచారించేందుకు అనుమతి కోరుతూ ఈ నెల ఆరంభం లో ఈడీ… ఎల్జీ ను ఆశ్రయించింది.అందుకు అంగీకరిస్తూ తాజాగా ప్రకటన విడుదల చేసింది.ఈ కేసులో అరెస్టు అయిన కేజ్రీవాల్ కొన్ని రోజుల పాటు తీహార్ జైల్ లో ఉన్నారు.సెప్టెంబర్ నెలలో విడుదల అయ్యారు. ఇటీవల ఈ కేసులో తనపై విచారణ ప్రక్రియను నిలిపివేయాలని కేజ్రీవాల్ అభ్యర్థనను హైకోర్టు తోసిపుచ్చిన విషయం తెలిసిందే.