రిలయన్స్ జియో తమ ఖాతాదారులకు మరో బిగ్ షాక్ ఇచ్చింది.ఈ మేరకు రెండు డేటా ప్లాన్ల వ్యాలిడిటీని తగ్గించింది.అయితే రెండు పాప్యులర్ రీఛార్జి ప్లాన్లు రూ. 189, రూ. 479లను తొలగించిన జియో…ఇప్పుడు రూ. 69, రూ. 139 డేటా ప్లాన్ల గడువును తగ్గించి, కేవలం 7 రోజులకు కుదించింది.ఇంతకుముందు ఈ డేటా ప్లాన్ల గడువు బేస్ ప్లాన్ ఎన్ని రోజులు ఉంటే అప్పటివరకు ఉండేది.కాగా ఇక నుండి రూ.69తో రీఛార్జ్ చేసుకుంటే 6జీబీ, రూ. 139తో చేస్తే వచ్చే 12 జీబీ డేటా వారం రోజులే వస్తుంది.ఈ విషయాన్ని జియో తన అధికారిక వెబ్సైట్ ద్వారా నిన్న ఓ ప్రకటన విడుదల చేసింది.
ట్రాయ్ ఆదేశాల ప్రకారం జియో ఇటీవల వాయిస్ ఓన్లీ పేరిట రెండు రీఛార్జ్ ప్లాన్లను తీసుకువచ్చిన సంగతి తెలిసిందే.రూ. 458, రూ. 1,958 ప్లాన్లను ప్రారంభించింది. రూ.458 ప్లాన్ వాలిడిటీ 84 రోజులు.దీనిలో దేశీయంగా ఉచిత అపరిమిత కాలింగ్తో పాటు 1,000 ఉచిత ఎస్సెమ్మెస్లను పొందవచ్చు.అయితే జియో సినిమా,జియో టీవీ యాప్లకు యాక్సెస్ అందుబాటులో ఉంటుంది. ఇందులో మొబైల్ డేటా ఉండదు.అదేవిధంగా రూ.1,958 ప్లాన్ 365 రోజుల పాటు చెల్లుబాటు అవుతుంది.దీనిలో ఉచిత అపరిమిత కాలింగ్, 3,600 ఎస్సెమ్మెస్లు లభిస్తాయి.ఈ ప్లాన్ కూడా మొబైల్ డేటా ఇవ్వలేదు.