సచివాలయంలో రాష్ట్ర పౌల్ట్రీ అసోసియేషన్ ప్రతినిధులతో ఏపీ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన పౌల్ట్రీల యాజమాన్యం అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ప్రభుత్వం పటిష్టమైన చర్యలు చేపడుతోంది. పటిష్టమైన చర్యలతో పరిస్థితి అదుపులో ఉందని స్పష్టం చేశారు. ప్రజలు నిర్భయంగా ఉడికించిన గ్రుడ్లను, మాంసాన్ని తీసుకోవచ్చని తెలిపారు. ఏపీ సీఎం చంద్రబాబు, కేంద్ర ప్రభుత్వ పశుసంవర్థక శాఖ జాయింట్ సెక్రటరీతో పాటు బోపాల్ లోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హైసెక్యురిటీ యానిమల్ డిసీజెస్ ల్యాబ్ శాస్త్రవేత్తలతో కూడా చర్చించారు. కేంద్ర నుండి ఇప్పటికే పలు బృందాలు రాష్ట్రానికి వచ్చాయి. కేంద్ర ప్రభుత్వ పశుసంవర్థక శాఖ జాయింట్ సెక్రటరీ కూడా రేపు రాష్ట్రానికి రానున్నారని వివరించారు. బాగా ఉడికించిన గ్రుడ్లను, మాంసాన్ని నిరభ్యంతరంగా ప్రజలు తినవచ్చని తెలిపారు. తప్పుడు వార్తలు, సమాచారాన్ని వ్యాప్తి చేసేవారి పై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.
Trending
- ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది: ఏపీ సీఎం చంద్రబాబు
- త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక టంగుటూరికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు
- గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం: మంత్రి నారా లోకేష్
- అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ
- కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష
- ‘మన శంకరవరప్రసాద్ గారు’…’పండగకి వస్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు
- ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు
- సెలక్షన్ కమిటీ ఛైర్మన్ గా అజిత్ అగార్కర్ పదవీకాలం పొడిగింపు