ఆంధ్రప్రదేశ్ ఫైబర్ నెట్ లో ముగ్గురు అధికారులను తొలగిస్తున్నట్లు ఏపీ ఫైబర్ నెట్ ఛైర్మన్ జీ.వి.రెడ్డి తెలిపారు. ఈమేరకు మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. బిజినెస్ అండ్ ఆపరేషన్స్ హెడ్ గంధం శెట్టి సురేష్, చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ పప్పూ భరద్వాజ, ప్రొక్యూర్ మెంట్ అసిస్టెంట్ మేనేజర్ శశాంక్ హైదర్ ఖాన్ ను తొలగిస్తున్నట్లు తెలిపారు. సంస్థలో 400 మందిని తొలగించాలని ఆదేశించిన వారు పట్టించుకోలేదు. ఎంప్లాయీస్ తొలగింపు ఆదేశాలపై ఫైబర్ నెట్ ఎండీ, ఉండీ సంతకాలు చేయలేదు. జీతాల రూపంలో సంస్థ డబ్బు చెల్లించారు. జీఎస్టీ అధికారులు సంస్థకు రూ.377 కోట్లు ఫైన్ విధించారు. గత నెలలో ఫైన్ విధించినా అధికారులు తన దృష్టికి తీసుకురాలేదని పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఇన్ని నెలలు ఆయినా ఫైబర్ నెట్ లో పురోగతి లేదని సంస్కరణలు తీసుకు రావాలని చూస్తున్నా అధికారులు సహాకరించడం లేదని తెలిపారు.
Trending
- ఇంటర్నేషనల్ టీ20లకు రిటైర్మెంట్ ప్రకటించిన కేన్ విలియమ్ సన్
- ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది: ఏపీ సీఎం చంద్రబాబు
- త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక టంగుటూరికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు
- గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం: మంత్రి నారా లోకేష్
- అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ
- కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష
- ‘మన శంకరవరప్రసాద్ గారు’…’పండగకి వస్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు
- ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు

