ఈరోజు ట్రేడింగ్ లో దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ నష్టాలు చూశాయి. దాదాపు 8 నెలల కనిష్టానికి పడిపోయాయి. మార్కెట్లకు ‘బ్లాక్ మండే’గా విశ్లేషకులు చెబుతున్నారు. ట్రంప్ నిర్ణయాల ప్రభావంతో వాణిజ్య భయాలు, విదేశీ ఇన్వెస్టర్ల అమ్మకాలు, జియోలాజికల్ పొలిటికల్ పరిస్థితుల నేపథ్యంలో సూచీలు నష్టాల బాటలో పయనించాయి. బాంబే స్టాక్ ఎక్స్ చేంజ్ సూచీ సెన్సెక్స్ 856 పాయింట్లు నష్టపోయి 74,454 వద్ద స్థిరపడింది. నేషనల్ స్టాక్ ఎక్స్ చేంజ్ నిఫ్టీ 243 పాయింట్ల నష్టంతో 22,552 వద్ద ట్రేడింగ్ ముగించింది. డాలర్ తో రూపాయి మారకం విలువ రూ.86.72గా కొనసాగుతోంది. ఐటీ, మెటల్, టెలికాం సూచీలు నష్టాలతో ట్రేడింగ్ ముగించాయి. కోటక్ మహింద్రా, హీరో మోటార్స్, ఐషర్ మోటార్స్, మహీంద్రా అండ్ మహీంద్రా షేర్లు లాభాలతో ముగిశాయి.
Trending
- ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది: ఏపీ సీఎం చంద్రబాబు
- త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక టంగుటూరికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు
- గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం: మంత్రి నారా లోకేష్
- అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ
- కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష
- ‘మన శంకరవరప్రసాద్ గారు’…’పండగకి వస్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు
- ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు
- సెలక్షన్ కమిటీ ఛైర్మన్ గా అజిత్ అగార్కర్ పదవీకాలం పొడిగింపు