దేశీయ స్టాక్ మార్కెట్లు ఈ వారాన్ని భారీ లాభాలతో ఘనంగా ఆరంభించాయి. ముఖ్యంగా బ్యాంకింగ్ షేర్లు లాభాలతో సూచీల జోరును మరింత పెంచేశాయి. ఇన్వెస్టర్ల సంపదగా భావించే సెన్సెక్స్ లో నమోదిత కంపెనీల మార్కెట్ విలువ రూ.5 లక్షల కోట్ల మేర పెరిగి రూ.418లక్షల కోట్లకు చేరింది. నేషనల్ స్టాక్ ఎక్స్ చేంజ్ నిఫ్టీ మిడ్, స్మాల్ క్యాప్ సూచీలు కూడా 1% లాభాపడ్డాయి. ఇక నేటి ట్రేడింగ్ లో బాంబే స్టాక్ ఎక్స్ చేంజ్ సూచీ సెన్సెక్స్ 1078 పాయింట్లు లాభంతో 77,984 వద్ద స్థిరపడింది. నేషనల్ స్టాక్ ఎక్స్ చేంజ్ నిఫ్టీ 307 పాయింట్లు లాభపడి 23,658 వద్ద ట్రేడింగ్ ముగించింది. డాలర్ తో రూపాయి మారకం విలువ రూ.85.61గా కొనసాగుతోంది. టెక్ మహీంద్రా, ఎన్టీపీసీ, కోటక్ మహీంద్రా, ఎస్.బీ.ఐ, పవర్ గ్రిడ్ కార్పొరేషన్ షేర్లు ప్రధానంగా లాభపడ్డాయి.
Trending
- ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది: ఏపీ సీఎం చంద్రబాబు
- త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక టంగుటూరికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు
- గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం: మంత్రి నారా లోకేష్
- అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ
- కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష
- ‘మన శంకరవరప్రసాద్ గారు’…’పండగకి వస్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు
- ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు
- సెలక్షన్ కమిటీ ఛైర్మన్ గా అజిత్ అగార్కర్ పదవీకాలం పొడిగింపు