స్మార్ట్ ఆంధ్రప్రదేశ్ ఫౌండేషన్ కు పశ్చిమ గోదావరి జిల్లా దేవరపల్లికి చెందిన పరమేసు బయోటెక్ లిమిటెడ్ రూ.50 లక్షల విరాళం అందజేసింది. ఉండవల్లి నివాసంలో ఏపీ విద్యా ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ ను కలిసిన ఆ కంపెనీ డైరెక్టర్ ఆనంద స్వరూప్ అదవానీ చెక్ అందజేశారు. ప్రజల జీవితాల్లో మార్పు తెచ్చేందుకు, విద్యా ప్రమాణాలు మెరుగుపర్చేందుకు స్మార్ట్ ఆంధ్రప్రదేశ్ ఫౌండేషన్ కు విరాళం అందజేసిన పరమేసు బయోటెక్ లిమిటెడ్ ప్రతినిధులను ఈ సందర్భంగా మంత్రి లోకేష్ అభినందించారు.
స్మార్ట్ ఆంధ్రప్రదేశ్ ఫౌండేషన్ కు పరమేసు బయోటెక్ లిమిటెడ్ రూ.50 లక్షల విరాళం
By admin1 Min Read