దేశీయ స్టాక్ మార్కెట్లు నేటి ట్రేడింగ్ లో భారీ పతనాన్ని చూశాయి. అంతర్జాతీయ మార్కెట్ల ప్రతికూల సంకేతాలు, వాణిజ్య యుద్ధ భయాల నేపథ్యంలో సూచీలు కుదేలయ్యాయి. దేశీయంగా నే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా ఇవే పరిస్థితి ఏర్పడింది. అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ టారిఫ్ ల ప్రకటన అనంతరం మాంద్యం భయాలు కొనసాగుతున్నాయి. బాంబే స్టాక్ ఎక్స్ చేంజ్ సూచీ సెన్సెక్స్ 2,226 పాయింట్ల నష్టంతో 73,137 వద్ద స్థిరపడింది. నేషనల్ స్టాక్ ఎక్స్ చేంజ్ నిఫ్టీ 742 పాయింట్లు నష్టపోయి 22,161 వద్ద ట్రేడింగ్ ముగించింది. డాలర్ తో రూపాయి మారకం విలువ రూ.85.80గా కొనసాగుతోంది. ప్రధాన రంగాల పేర్లన్నీ దాదాపుగా నష్టాలతో ట్రేడింగ్ ముగించాయి. ఇన్వెస్టర్ల సంపద ఆవిరైంది. హిందుస్థాన్ యూనీలివర్ షేర్లు లాభాలతో ముగిశాయి. బీ.ఎస్.ఈ నమోదిత కంపెనీల విలువ రూ.14 లక్షల కోట్లు ఆవిరై రూ.389 లక్షల కోట్లకు చేరింది.
Trending
- ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది: ఏపీ సీఎం చంద్రబాబు
- త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక టంగుటూరికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు
- గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం: మంత్రి నారా లోకేష్
- అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ
- కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష
- ‘మన శంకరవరప్రసాద్ గారు’…’పండగకి వస్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు
- ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు
- సెలక్షన్ కమిటీ ఛైర్మన్ గా అజిత్ అగార్కర్ పదవీకాలం పొడిగింపు