ఈ రోజు వెలగపూడి సచివాలయంలో జిల్లాలు, మండలాలు, గ్రామాల పేర్లు, సరిహద్దుల మార్పులపై జరిగిన గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ తొలిభేటీలో మంత్రులు అనిగాని సత్య ప్రసాద్, నారాయణ, హోం మంత్రి , బి.సి.జనార్థన్ రెడ్డి, రామా నాయుడు, నాదెండ్ల మనోహర్, సత్య కుమార్ లు పాల్గొన్నారు. జిల్లాల పేర్లు సరిహద్దుల మార్పుపై ఇప్పటికే ప్రభుత్వానికి అందిన వినతులపై చర్చించినట్లు తెలిపారు. ఈరోజు కూడా కొంతమంది ప్రజలు తమకు కొత్త మండలాలు ఏర్పాటు చేయాలని, జిల్లాల సరిహద్దులు మార్చాలని వినతులు సమర్పించారని వివరించారు. త్వరలోనే మంత్రుల బృందం జిల్లాలలో పర్యటించి ప్రజల అభిప్రాయాలను కూడా స్వీకరిస్తుందని స్పష్టం చేశారు. ప్రజల వెసులుబాటు, ఆయా ప్రాంతాలతో ముడిపడిన సాంస్కృతిక భావోద్వేగాలు, దూరాభారం ఇలా పలు అంశాలను బేరీజు వేసుకుని జిల్లాలు, మండలాలు, గ్రామాల భౌగోళిక సరిహద్దులపై రాష్ట్ర ప్రభుత్వం ప్రజలందరికీ ఆమోదయోగ్యమైన, సామరస్య నిర్ణయం తీసుకుంటుందని వివరించారు.
Trending
- ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది: ఏపీ సీఎం చంద్రబాబు
- త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక టంగుటూరికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు
- గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం: మంత్రి నారా లోకేష్
- అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ
- కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష
- ‘మన శంకరవరప్రసాద్ గారు’…’పండగకి వస్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు
- ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు
- సెలక్షన్ కమిటీ ఛైర్మన్ గా అజిత్ అగార్కర్ పదవీకాలం పొడిగింపు