ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి నీ.వీ.సింధు ఆమె తండ్రి శ్రీ పి.వి. రమణ గారితో కలిసి నేటి సాయంత్రం మంగళగిరిలోని క్యాంపు కార్యాలయంలో ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కు వివాహ ఆహ్వాన పత్రిక అందించారు. తాజాగా ఆమె ఎంగేజ్మెంట్ జరిగింది. పోసిడెక్స్ టెక్నాలజీస్ ఈడీ వెంకట దత్తసాయి – సింధు ఉంగరాలు మార్చుకున్నారు. ఈ ఫొటోను సింధు తన అధికారిక ఇన్స్టాగ్రామ్ ఖాతా ద్వారా అభిమానులతో పంచుకున్నారు.’ఒకరి ప్రేమ మనకు దక్కినప్పుడు తిరిగి మనమూ ప్రేమించాలి’ అనీ పేర్కొన్నారు. కాగా, ఈ జంట ఈ నెల 22న రాజస్థాన్లో పెళ్లి చేసుకోనున్నారు.
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కు తన వివాహ ఆహ్వాన పత్రిక అందించిన స్టార్ షట్లర్ సింధు
By admin1 Min Read
Previous Articleమామయ్య మెగాస్టార్ చిరంజీవిని కలిసిన అల్లు అర్జున్
Next Article సుప్రసిద్ధ తబలా విద్వాంసుడు జాకీర్ హుస్సేన్ కన్నుమూత