హైదరాబాద్ లో 100 అడుగుల ఎత్తైన ఎన్టీఆర్ విగ్రహం ఏర్పాటుకు సహాకారం అందించేందుకు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అంగీకారం తెలిపారు. ఎన్టీఆర్ కుమారుడు నందమూరి మోహనకృష్ణ, టీడీపీ పొలిటికల్ సెక్రటరీ టీడీ జనార్దన్, ఎన్టీఆర్ లిటరేచర్ సభ్యులు మధుసూదన రాజు , తెలంగాణ రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో కలిసి సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు.
హైదరాబాద్లో 100 అడుగుల ఎత్తుతో ఎన్టీఆర్ విగ్రహాన్ని నెలకొల్పాలన్న సంకల్పాన్ని వివరించి, దానితోపాటు ఎన్టీఆర్ నాలెడ్జి సెంటర్ను ఏర్పాటు చేయనున్నట్లు వివరించారు. ఇందుకుగాను తెలంగాణ ప్రభుత్వం తరఫున స్థలాన్ని కేటాయించి సహకరించాలని కోరగా హైదరాబాద్లో, ప్రత్యేకించి ఔటర్ రింగ్ రోడ్డు సమీపంలో విగ్రహం ప్రతిష్టాపనకు మరియు ఎన్టీఆర్ నాలెడ్జ్ సెంటర్ ఏర్పాటు కోసం ప్రభుత్వపరంగా స్థలం కేటాయించడానికి సీఎం రేవంత్ రెడ్డి అంగీకరించడం పట్ల వారు సంతోషం వ్యక్తం చేశారు. ఎన్టీఆర్ లిటరేచర్ కమిటీ చేపట్టిన కార్యక్రమాలను సీఎంకు వారు వివరించారు. ఎన్టీఆర్ తెలుగు ప్రజలందరికీ ఇష్టమైన నటుడు, నాయకుడని.. ఆయన 100 అడుగుల విగ్రహం హైదరాబాద్లో ప్రతిష్టించాలన్న ప్రతిపాదనకు తమవంతు సహకారం అందిస్తామని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.
Previous Articleపాక్ క్షిపణులతో మా దేశానికీ ముప్పే: అమెరికా
Next Article భారత్ సంస్థపై అమెరికా ఆంక్షలు..!!