దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు వరుసగా మూడో రోజు కూడా నష్టాల్లోనే ముగిశాయి. ఆద్యంతం ఒడిదుడుకుల్లో పయనించిన సూచీలు చివరికి నష్టాలతో ట్రేడింగ్ ముగించాయి. ఐటీ షేర్లు లాభపడ్డాయి. ఫైనాన్షియల్, హెల్త్, ఆటోమొబైల్ షేర్లు నష్టాలతో ముగిశాయి. బాంబే స్టాక్ ఎక్స్ చేంజ్ సూచీ సెన్సెక్స్ 242 పాయింట్లు నష్టపోయి 77, 378 వద్ద స్థిరపడింది. నేషనల్ స్టాక్ ఎక్స్ చేంజ్ సూచీ నిఫ్టీ 86 పాయింట్ల నష్టంతో 23,440 వద్ద ముగిసింది. డాలరుతో రూపాయి మారకం విలువ 86.03గా కొనసాగుతోంది. టెక్ మహీంద్రా, టీసీఎస్, ఇన్ఫోసిస్, హెచ్.సీ.ఎల్ టెక్నాలజీస్, బజాజ్ ఫిన్ సర్వ్ షేర్లు లాభాలతో ముగిశాయి.
Trending
- ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది: ఏపీ సీఎం చంద్రబాబు
- త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక టంగుటూరికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు
- గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం: మంత్రి నారా లోకేష్
- అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ
- కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష
- ‘మన శంకరవరప్రసాద్ గారు’…’పండగకి వస్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు
- ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు
- సెలక్షన్ కమిటీ ఛైర్మన్ గా అజిత్ అగార్కర్ పదవీకాలం పొడిగింపు