దేశీయ స్టాక్ మార్కెట్లు నేటి ట్రేడింగ్ ను లాభాలతో ముగించాయి. ఉదయం ట్రేడింగ్ ఆరంభంలో అంతర్జాతీయ మార్కెట్ల మిశ్రమ సంకేతాలతో ఫ్లాట్ గా ట్రేడింగ్ ఆరంభించాయి. అనంతరం ఐటీ షేర్లలో ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు మొగ్గు చూపడంతో సూచీలు చివరికి లాభాలతో ముగిశాయి. బాంబే స్టాక్ ఎక్స్ చేంజ్ సూచీ సెన్సెక్స్ 226 పాయింట్లు లాభపడి 76,759 వద్ద స్థిరపడింది. నేషనల్ స్టాక్ ఎక్స్ చేంజ్ సూచీ నిఫ్టీ 86 పాయింట్ల లాభంతో 23,249 వద్ద ముగిసింది. డాలరుతో రూపాయి మారకం విలువ 86.64గా కొనసాగుతోంది. సెన్సెక్స్ లో పవర్ గ్రిడ్ కార్పొరేషన్, భారతీ ఎయిర్టెల్, నెస్లే ఇండియా, బజాజ్ ఫైనాన్స్, ఎం అండ్ ఎం, హెచ్.యూ.ఎల్, రిలయన్స్ ఇండస్ట్రీస్, ఏషియన్ పెయింట్స్ షేర్లు లాభాలతో ముగిశాయి.
Trending
- ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది: ఏపీ సీఎం చంద్రబాబు
- త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక టంగుటూరికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు
- గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం: మంత్రి నారా లోకేష్
- అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ
- కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష
- ‘మన శంకరవరప్రసాద్ గారు’…’పండగకి వస్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు
- ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు
- సెలక్షన్ కమిటీ ఛైర్మన్ గా అజిత్ అగార్కర్ పదవీకాలం పొడిగింపు