నేటి ట్రేడింగ్ ను దేశీయ స్టాక్ మార్కెట్లు ఫ్లాట్ గా ముగించాలి. నిన్నటి భారీ నష్టాల నుండి కోలుకుని ఒక మోస్తరుగా కదలాడాయి. అంతర్జాతీయ ప్రతికూల పరిణామాలతో ఫ్లాట్ గా ప్రారంభమైన మార్కెట్లు అనంతరం ప్రధాన రంగాల షేర్లు రాణించడంతో లాభాల్లోకి దూసుకెళ్లాయి. ఒకదశలో సెన్సెక్స్ 300 పాయింట్లకు పైగా లాభపడింది. చివరకు బాంబే స్టాక్ ఎక్స్ చేంజ్ సూచీ సెన్సెక్స్ 147 పాయింట్లు లాభపడి 74,602 వద్ద స్థిరపడింది. నేషనల్ స్టాక్ ఎక్స్ చేంజ్ నిఫ్టీ 5 పాయింట్ల నష్టంతో 22,547 వద్ద ట్రేడింగ్ ముగించింది. డాలర్ తో రూపాయి మారకం విలువ రూ.87.19గా కొనసాగుతోంది. ఎం అండ్ ఎం, భారతీ ఎయిర్టెల్, బజాజ్ ఫైనాన్స్, టొమాటో, నెస్లే ఇండియా, మారుతీ సుజుకి, టైటాన్, ఐసీఐసీఐ బ్యాంక్, హెచ్.యూ.ఎల్, అదానీ పోర్ట్స్ షేర్లు లాభాలతో ముగిశాయి.
Trending
- ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది: ఏపీ సీఎం చంద్రబాబు
- త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక టంగుటూరికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు
- గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం: మంత్రి నారా లోకేష్
- అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ
- కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష
- ‘మన శంకరవరప్రసాద్ గారు’…’పండగకి వస్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు
- ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు
- సెలక్షన్ కమిటీ ఛైర్మన్ గా అజిత్ అగార్కర్ పదవీకాలం పొడిగింపు