దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా నాలుగో రోజు ట్రేడింగ్ ను లాభాలతో ముగించాయి. ముఖ్యంగా బ్యాంకింగ్, ఐటీ షేర్లు రాణించడంతో సూచీలు దూసుకెళ్లాయి. దేశీయంగా ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు మొగ్గు చూపడం కూడా మార్కెట్ కు కలిసొచ్చింది. బాంబే స్టాక్ ఎక్స్ చేంజ్ సూచీ సెన్సెక్స్ 899 పాయింట్లు లాభంతో 76,348 వద్ద స్థిరపడింది. నేషనల్ స్టాక్ ఎక్స్ చేంజ్ నిఫ్టీ 283 పాయింట్లు లాభపడి 23,190 వద్ద ట్రేడింగ్ ముగించింది. డాలర్ తో రూపాయి మారకం విలువ రూ.86.35గా కొనసాగుతోంది. టైటాన్, మహీంద్రా అండ్ మహీంద్రా, టీసీఎస్, హిందూస్థాన్ యూనీలివర్ షేర్లు లాభాలతో ముగిశాయి.
Trending
- ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది: ఏపీ సీఎం చంద్రబాబు
- త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక టంగుటూరికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు
- గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం: మంత్రి నారా లోకేష్
- అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ
- కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష
- ‘మన శంకరవరప్రసాద్ గారు’…’పండగకి వస్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు
- ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు
- సెలక్షన్ కమిటీ ఛైర్మన్ గా అజిత్ అగార్కర్ పదవీకాలం పొడిగింపు