గత సెషన్ లో ఒక మోస్తరు నష్టాలతో ట్రేడింగ్ ముగించిన దేశీయ స్టాక్ మార్కెట్లు నేటి ట్రేడింగ్ లో భారీ నష్టాలు చూశాయి. ఇటీవల అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ ప్రకటించిన టారిఫ్ లతో అంతర్జాతీయ మార్కెట్లు కుదేలవడంతో ఆ ప్రభావం మన మార్కెట్ల పైన పడింది. బీ.ఎస్.ఈ సెన్సెక్స్ 30లో నమోదిత కంపెనీల విలువ దాదాపు రూ.9.5 లక్షల కోట్లు క్షీణించి రూ.403 లక్షల కోట్లకు చేరింది. బాంబే స్టాక్ ఎక్స్ చేంజ్ సూచీ సెన్సెక్స్ 930 పాయింట్ల నష్టంతో 75,364 వద్ద స్థిరపడింది. నేషనల్ స్టాక్ ఎక్స్ చేంజ్ నిఫ్టీ 345 పాయింట్లు నష్టపోయి 22,904 వద్ద ట్రేడింగ్ ముగించింది. డాలర్ తో రూపాయి మారకం విలువ రూ.85.42గా కొనసాగుతోంది. ఐసీఐసీఐ బ్యాంక్, హెచ్.డి.ఎఫ్.సి బ్యాంక్, నెస్లే ఇండియా, బజాజ్ ఫైనాన్స్ షేర్లు లాభాలతో ముగిశాయి.
Trending
- ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది: ఏపీ సీఎం చంద్రబాబు
- త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక టంగుటూరికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు
- గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం: మంత్రి నారా లోకేష్
- అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ
- కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష
- ‘మన శంకరవరప్రసాద్ గారు’…’పండగకి వస్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు
- ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు
- సెలక్షన్ కమిటీ ఛైర్మన్ గా అజిత్ అగార్కర్ పదవీకాలం పొడిగింపు