వైజాగ్ లోని రుషికొండ బీచ్ అత్యంత ప్రతిష్ఠాత్మకమైన బ్లూఫ్లాగ్ గుర్తింపును కోల్పోయింది.గతంలో రుషికొండ వద్ద 600 మీటర్ల తీర ప్రాంతాన్ని బ్లూఫాగ్ బీచ్గా ధ్రువీకరిస్తూ 2020లో డెన్మార్క్కు చెందిన ఫౌండేషన్ ఫర్ ఎన్విరాన్మెంటల్ ఎడ్యుకేషన్ సంస్థ సర్టిఫికెట్ అందించింది.గత కొంతకాలంగా ఇక్కడి బీచ్లోకి శునకాలు రావడం,సీసీ కెమెరాలు పనిచేయకపోవడం,వ్యర్థాలు పేరుకుపోవడం,మూత్రశాలలు, దుస్తులు మార్చుకునే గదులు అధ్వానంగా ఉండటం గుర్తించిన కొందరు ఫొటోలతో ఎఫ్ఈఈ సంస్థకు ఫిబ్రవరి 13 తేదీన ఫిర్యాదు చేశారు.దీనిని తీవ్రంగా పరిగణించిన ఆ సంస్థ రుషికొండ బీచ్కు బ్లూ ఫాగ్ గుర్తింపును రద్దు చేసింది.
Previous Articleకర్ణాటక డిప్యూటీ సీఎంపై సొంత పార్టీ నేతలు విమర్శలు….!
Next Article 7కు చేరిన ఉత్తరాఖండ్ మృతుల సంఖ్య..!