ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు ఢిల్లీ పర్యటనలో భాగంగా మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్తో భేటీ అయ్యారు.ఈ సమావేశం అద్భుతంగా సాగిందని చంద్రబాబు తన ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి, ప్రజల సంక్షేమం కోసం గేట్స్ ఫౌండేషన్తో భాగస్వామ్యం ఎలా కొనసాగించాలి అనే అంశంపై విస్తృతంగా చర్చించారు.ఆరోగ్యం,విద్య, వ్యవసాయం, ఉపాధి రంగాల్లో ఆధునిక సాంకేతికతను ఎలా వినియోగించాలని దానిపై మాట్లాడినట్లు తెలిపారు.
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ప్రెడిక్టివ్ ఎనలిటిక్స్ వంటి సాంకేతికతలతో ప్రభుత్వ సేవలను మరింత మెరుగుపరిచే మార్గాలను అన్వేషిస్తున్నామని చెప్పారు.స్వర్ణాంధ్ర ప్రదేశ్-2047 విజన్ను సాకారం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు.ప్రజల సాధికారత కోసం గేట్స్ ఫౌండేషన్తో భాగస్వామ్యం కీలకమని విశ్వసిస్తున్నామని పేర్కొన్నారు.రాష్ట్ర పురోగతి కోసం తమ సమయం,ఆలోచనలు,మద్దతు ఇస్తున్నందుకు బిల్ గేట్స్కు చంద్రబాబు ధన్యవాదాలు తెలిపారు.ఈ భేటీ ద్వారా రాష్ట్రానికి వినూత్న అవకాశాలు రాబోయే అవకాశముందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.
Had a wonderful meeting with Mr @BillGates today. We had a very productive discussion on how the GoAP and the Gates Foundation can collaborate for the development and welfare of the people of Andhra Pradesh. We explored the use of advanced technologies like Artificial… pic.twitter.com/EtNAYY28L6
— N Chandrababu Naidu (@ncbn) March 19, 2025