స్టైల్ స్టార్ అల్లు అర్జున్ ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఆయన మిత్రుడు,అప్పటి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి శిల్పా రవిచంద్రారెడ్డి కోసం నంద్యాల వచ్చిన విషయం తెలిసిందే.ఆ సమయంలో అల్లు అర్జున్ నంద్యాల పర్యటించడం తీవ్ర వివాదాస్పదమైంది.ఈ అంశం పోలీసు కేసు, న్యాయస్థానాల్లో పిటిషన్ల వరకు వెళ్లింది.ఈ మేరకు తాజాగా టీడీపీ నంద్యాల ఎంపీ బైరెడ్డి శబరి ఎక్స్ లో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.అల్లు అర్జున్ గారూ…. నంద్యాలలో మీరు చేసిన ఎన్నికల ప్రచారాన్ని ఇక్కడి ప్రజలు ఇప్పటికీ మర్చిపోలేకపోతున్నారు.నంద్యాలలో మీరు ప్రీ ఎలక్షన్ ఈవెంట్ నిర్వహించినట్టుగానే…ఇక్కడే ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా ఏర్పాటు చేస్తే బాగుంటుందని భావిస్తున్నానని వ్యంగ్యంగా పోస్ట్ చేశారు.
నంద్యాలను సందర్శించాలన్న మీ సెంటిమెంటు మాకు మాత్రం బాగా వర్కౌట్ అయిందని సెటైర్ వేశారు. అల్లు అర్జున్ గారూ… ఇప్పుడు మీ సెంటిమెంటే మా సెంటిమెంటు.అంతేకాదు, మీ పుష్ప-2 చిత్రం పాన్ ఇండియా లెవల్లో భారీ విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం” అంటూ బైరెడ్డి శబరి ట్వీట్ చేశారు. అయితే,ఆ తర్వాత మొత్తం ట్వీట్నే బైరెడ్డి శబరి డిలీట్ చేయడం గమనార్హం.ఆమె చేసిన ట్వీట్లకు మిశ్రమ స్పందన వచ్చింది.కొందరు ఆమెకు మద్దతుగా వ్యాఖ్యలు చేయగా.. మరికొందరు మీకు ఇలాంటివి ఇప్పుడు అవసరమా? అని ప్రశ్నించారు. భిన్న స్పందనలు రావడంతో శబరి తన ట్వీట్ను డిలీట్ చేశారు.