వైసీపీ హయాంలో ఆస్తులు లాక్కోవడం ట్రెండ్గా మారితే.. వాటిని చూసి మౌనం వహించడం కూటమి సర్కార్ ట్రెండ్గా పెట్టుకుందని ఏపీసీసీ చీఫ్ షర్మిల విమర్శించారు. అధికారంలోకి వచ్చి 6 నెలలు దాటినా గత ప్రభుత్వం ధారాదత్తం చేసిన ఏ ఒక్క ఆస్తిపై, కనీసం ఒక్క చర్య కూడా లేదు. విచారణకు సైతం దిక్కులేదు. రాష్ట్రంలో కాకినాడ పోర్టు ఒక్కటే కాదు..కృష్ణపట్నం పోర్టును గుంజుకున్నారు. ప్రభుత్వ ఆధీనంలో అత్యధిక లాభాలు గడించే గంగవరం పోర్టును అప్పనంగా అమ్మేశారని దుయ్యబట్టారు. ఏపీని పోర్టులకు హబ్గా మార్చే పాలసీలు సరే. మరి గంగవరం పోర్ట్ సంగతేంటి..? అని ప్రశ్నించారు. ప్రతి ఏటా దాదాపు రూ.2వేల కోట్ల లాభాలు గడించే పోర్టును గత వైసీపీ ప్రభుత్వం 2021లో అదానీకి రాసి ఇచ్చింది. నికర ఆర్థిక నిల్వలతో పాటు.. రూ.9వేల కోట్ల విలువజేసే 10 శాతం వాటాను కేవలం రూ.640 కోట్లకు పుట్నాల కింద అమ్మారని పేర్కొన్నారు. 2,800 ఎకరాల విలువైన ప్రభుత్వ భూములను అదానీకి కట్టబెట్టారని విమర్శలు గుప్పించారు. BOT కింద ఇంకో 15 ఏళ్లలో పూర్తిగా ప్రభుత్వపరం అవ్వాల్సిన పోర్టు అదని పేర్కొన్నారు. అదానీకి కట్టబెట్టేటప్పుడు ఎలాంటి టెండర్లు లేవు. కళ్ళు మూసీ తెరిచేలోగా అన్ని అనుమతులు ఇచ్చేశారని ఆరోపించారు. పైగా మిగతా పోర్టుల అభివృద్ధికి ఆ నిధులు ఉపయోగం అని బుకాయించారని షర్మిల ట్వీట్ చేశారు. ప్రతిపక్షంలో ఉండగా గంగవరం పోర్టుపై చెప్పిన మీ మాటలకు,ఇచ్చిన హామీలకు, ఇప్పుడు అమలు చేస్తున్న విధానాలకు ఎంతమాత్రం పొంతన లేదు. గంగవరం పోర్టులో ప్రభుత్వానికి ఉన్న వాటాను వెనక్కు తీసుకొనే విధంగా చర్యలు చేపట్టాలని కూటమి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
వాటిని చూసి మౌనం వహించడం కూటమి సర్కార్ ట్రెండ్గా పెట్టుకుంది: ఏపీసీసీ చీఫ్ షర్మిల
By admin1 Min Read