భీమవరానికి చెందిన యువకుడు యేసు భీమవరం నుంచి సైకిల్పై లద్దాక్కు 3500 కి.మీ. ప్రయాణించి ఎక్స్లో పోస్టు చేశారు. దానిపై మంత్రి లోకేశ్ స్పందించారు. ‘నేను ఇండియాకి వచ్చాక నిన్ను కలుస్తాను. సవాలుతో కూడిన నీ ప్రయాణం విజయవంతంగా ముగిసినందుకు అభినందనలు. ఇలాగే పట్టుదలతో నువ్వు లక్ష్యాన్ని చేరుకోవడాన్ని కొనసాగించు’ అని మంత్రి రిప్లై ఇచ్చారు.
Author: Indu
ఉమ్మడి ప.గో.జిల్లాలోని రైల్వే స్టేషన్లను కేంద్ర ప్రభుత్వం అమృత్ భారత్ స్కీం ద్వారా అభివృద్ధి చేయనుంది. ఇందులో రాష్ట్రంలోని 53 స్టేషన్లు ఎంపిక కాగా జిల్లాలోని పలు స్టేషన్లకూ చోటు దక్కింది. తాడేపల్లిగూడెం, నిడదవోలు జంక్షన్ అభివృద్ధికి రూ.27 కోట్లు, నరసాపురం, రేపల్లెకు రూ.25 కోట్లు, భీమవరం టౌన్, ఏలూరు స్టేషన్లలో రూ.21 కోట్లతో ఆధునికీకరణ పనులు చేపట్టనున్నారు.
గోదావరి పుష్కరాల నిర్వహణకు ముహూర్తం ఖరారయింది. ప్రతీ 12 ఏళ్లకు ఒకసారి జరిగే పుష్కరాల కోసం ప్రభుత్వం ఏర్పాట్లు మొదలు పెట్టింది. 2027 జులై 23 నుంచి ఆగస్టు 3 వరకు ఈ పుష్కరాలు జరగనున్నాయి. ఈసారి పుష్కరాల కోసం 8 కోట్ల మంది భక్తులు వస్తారని అంచనా వేశారు. దీంతో గోదావరి జిల్లాల్లో పుష్కర ఘాట్ల అభివృద్ధికి రూ.904 కోట్ల నిధులతో ప్రతిపాదనలు అధికార యంత్రాంగం సిద్ధం చేసింది.
చీపురుపల్లిలో నేటి నుంచి మూడు రోజులు పాటు జరగనున్న శ్రీకనక మహాలక్మి అమ్మవారు జాతర జరగనుంది. ఈ జాతరకు గట్టి బందోబస్తు ఏర్పాటు చేసినట్లు డీఎస్పీ చక్రవర్తి తెలిపారు. స్థానిక పోలీసు అధికారులతో శనివారం చీపురుపల్లిలో పర్యటించారు. 18 సీసీ కెమెరాలతో నిరంతర పర్యవేక్షణ ఉంటుందని, సుమారు 8 వందల మంది పోలీసులు బందోబస్తు డ్యూటీలు వేశామన్నారు. అల్లరి మూకలపై, ప్రత్యేక నిఘా పెట్టినట్లు వెల్లడించారు.
రామభద్రపురం గ్రామంలో అర్ధరాత్రి దోపిడీ దొంగలు భీభత్సం సృష్టించారు. అర్ధరాత్రి దొంగలు ఓ ఇంట్లోకి చొరబడి నిద్రిస్తున్న దంపతులు రుద్రాక్షుల సత్యన్నారాయణ, అనురాధలపై కత్తితో దాడి చేసి.. అనురాధ చెయ్యిని విరిచి మెడలో ఉన్న రెండున్నర తులాల బంగారు పుస్తెల తాడును తెంచుకెళ్ళారు. ఆ తర్వాత దంపతులు బిగ్గరగా అరవడంతో స్థానికులు వెంటనే స్పందించి వారిని ఆసుపత్రికి తరలించి పోలీసులకు సమాచారం అందించారు.
TG: ఏటా దీపావళి పండుగకు HYDలోని చార్మినార్ భాగ్యలక్ష్మి ఆలయంలో వెండి నాణేలను పంపిణీ చేయడం ఆనవాయితీగా వస్తోంది. అమ్మవారికి భక్తులు సమర్పించిన వెండి కానుకలతో ఈ నాణేలను తయారు చేస్తారు. ఈసారి గురువారం ప్రారంభమైన కాయిన్స్ పంపిణీ రేపటి(ఆదివారం) వరకూ కొనసాగనుంది. ఈ నాణేలు లభిస్తే సకల శుభాలు కలుగుతాయని భక్తులు విశ్వసిస్తారు. రేపు సెలవు కావడంతో భక్తులు భారీగా వచ్చే అవకాశముంది.
విధులకు సంబంధించి పైస్థాయి వ్యక్తి తీసుకున్న నిర్ణయాలు ఉద్యోగి ఆత్మహత్యకు కారణంగా పరిగణించలేమని ఢిల్లీ హైకోర్టు వ్యాఖ్యానించింది. ‘ప్రైవేటు, ప్రభుత్వ రంగాల్లోని వ్యక్తుల నిర్ణయాలు ఉద్యోగులకు కొన్నిసార్లు కష్టతరంగా అనిపించవచ్చు. అయితే హానికారక ఉద్దేశం లేకపోతే ఉద్యోగి ఆత్మహత్యకు వారిని బాధ్యులుగా పరిగణించలేం’ అని బీఆర్ అంబేడ్కర్ కాలేజీ(Delhi వర్సిటీ) EX ప్రిన్సిపల్ కేసులో పేర్కొంది.
మోదీ గ్యారంటీ అనేది 140 కోట్ల మంది భారతీయులపై ఓ క్రూరమైన జోక్ అని కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే దుయ్యబట్టారు. కాంగ్రెస్ గ్యారంటీలను మోదీ విమర్శించడంపై ఖర్గే స్పందిస్తూ BJPలో B అంటే బిట్రేయల్(మోసం), J అంటే జుమ్లా(అబద్ధం) అని మండిపడ్డారు. 2 కోట్ల ఉద్యోగాలు, అచ్చే దిన్, వికసిత్ భారత్, నేను తినను-తిననివ్వను, సబ్కా సాత్-సబ్కా వికాస్ నినాదాలు ఏమయ్యాయని ఖర్గే ప్రశ్నించారు.
BSF, CISF, CRPF, SSB, ITBP, AR, SSF, NCBలో 39,481 GD కానిస్టేబుల్ ఉద్యోగాల కోసం గత నెలలో దరఖాస్తుల స్వీకరణ ముగిసింది. అయితే అభ్యర్థులు తమ దరఖాస్తుల్లో సవరణ చేసుకునేందుకు స్టాఫ్ సెలక్షన్ కమిషన్ అవకాశం కల్పించింది. నవంబర్ 5వ తేదీ అర్ధరాత్రి 12 గంటల నుంచి 7వ తేదీ రాత్రి 11 వరకు మార్పులు చేసుకోవచ్చని తెలిపింది. గడువు ముగిసిన తర్వాత వచ్చే ఎలాంటి విజ్ఞప్తిని పరిగణనలోకి తీసుకోబోమని స్పష్టం చేసింది.
NZతో మూడో టెస్టులో భారత్ గెలుస్తుందా లేదా అనేది రేపు తేలనుంది. ఇప్పటికే 143 పరుగుల ఆధిక్యంలో ఉన్న NZ, INDకు 160 పరుగుల టార్గెట్ ఇచ్చే ఛాన్సుంది. దీనిని ఛేదించడం INDకు అంత సులభమేం కాదు. వాంఖడేలో ఇప్పటివరకు అత్యధిక రన్స్ ఛేజ్ చేసిన రికార్డు SA (163vsIND) పేరిట ఉంది. ఈ నేపథ్యంలో రేపు ఏం జరుగుతుందనే దానిపై క్రికెట్ ఫ్యాన్స్లో ఉత్కంఠ నెలకొంది. రేపు టీమ్ఇండియా గెలుస్తుందా? కామెంట్ చేయండి.